యాప్నగరం

సాగర్ పోరులో బీజేపీ కొత్త స్కెచ్.. ప్రత్యర్థులు ఊహించని రీతిలో అభ్యర్థి పేరు తెరపైకి!

Nagarjuna Sagar Bypollలో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ప్రత్యర్థులు ఊహించని రీతిలో విజయశాంతి పేరును తెరమీదకు తీసుకొచ్చింది.

Samayam Telugu 23 Jan 2021, 12:35 pm
నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. జానా రెడ్డిని బరిలో దిగుతారని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. జానాకు కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో.. విజయంపై హస్తం పార్టీ ధీమాతో ఉంది. జానారెడ్డి అంతా తానై వ్యవహరిస్తూ.. అందర్నీ కలుపుకుపోతున్నారు. ఇక దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. నాగార్జునసాగర్‌లో సత్తా చాటాలని భావిస్తోంది.
Samayam Telugu BJP
Representative Image


జానారెడ్డి లాంటి బలమైన అభ్యర్థిని ఢీకొట్టడం కోసం.. కొత్త వ్యూహాలను రూపొందిస్తోంది. ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. పార్టీలో చేరిన సినీ నటి విజయశాంతిని సాగర్ బరిలో దింపే విషయాన్ని బీజేపీ నాయకత్వం పరిశీలిస్తోంది. విజయశాంతి ఇక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని నల్గొండ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు.. పార్టీ నాయకత్వానికి సూచించారు.

సినీగ్లామర్‌కుతోడు.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విజయశాంతి చేస్తున్న విమర్శలు తమకు కలిసొస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయమై కమళనాథులు అంతర్గతంగా ఓ సర్వ నిర్వహిస్తున్నారు. విజయశాంతి బరిలోకి దిగితే.. బీజేపీ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది.

టీఆర్ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ బైపోల్ ఖాయమైంది. కాంగ్రెస్ తరఫున అభ్యర్థి దాదాపు ఖాయం కాగా.. టీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఇంకా తేలలేదు. నోముల కుమారుడికి టికెట్ ఇవ్వాలని పార్టీ నేతలు కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.