యాప్నగరం

మునుగోడులో బీజేపీ మూడో స్థానానికే పరిమితం: జగదీశ్ రెడ్డి

Jagadeesh Reddy: తెలంగాణలో చర్చ అంతా మునుగోడు ఉప ఎన్నిక పైనే నడుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. రాజకీయం రంజుగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 14 Aug 2022, 2:42 pm

ప్రధానాంశాలు:

  • మంత్రి జగదీశ్ రెడ్డి కీలక కామెంట్స్
  • మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని వ్యాఖ్య
  • బీజేపీ మూడో స్థానానికే పరిమితమన్న జగదీశ్ రెడ్డి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jagadeesh Reddy
మంత్రి జగదీశ్ రెడ్డి
Jagadeesh Reddy: మునుగోడు వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచింది. ఏ నేతను కదిలించినా మునుగోడు గురించే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ గెలుపు కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా.. మునుగోడు (Munugode) ఉప ఎన్నికపై మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో 100 ఫీట్ల ఎత్తున్న జాతీయ జెండాని ఆవిష్కరించిన మంత్రి జగదీశ్ రెడ్డి.. ఈడీ, బోడీలకు భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) గల్లీ లీడర్ అని జగదీశ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను బట్టీ.. ఈడీని జేబు సంస్థగా అనుకోవాలని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని చేసినా.. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యం అని స్పష్టం చేశారు. మోడీ ఇచ్చిన అక్రమ సంపాదనతో కోట్లు కుమ్మరించి గెలవాలని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నారా అని ప్రశ్నించారు. మునుగోడులో బీజేపీ మూడో స్థానానికే పరిమితం అవుతుందని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీ దుర్మార్గాలను బయటపెట్టే సత్తా ఉన్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ (CM KCR) అని చెప్పారు.

బీజేపీ పాలనలో దేశం మధ్యయుగ కాలం నాటికి వెళ్లిందని మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadeesh Reddy) సీరియస్ కామెంట్స్ చేశారు. బీజేపీని వ్యతిరేకించే వామపక్షాలు.. తమతో కలిసి వస్తాయని ఆశిస్తున్నామన్నారు. వామపక్షాలు కలిసి వస్తామంటే చర్చలకు ఆహ్వానిస్తామని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.