మునుగోడులో నైతికంగా తానే గెలిచానని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ‘మీది నిజమైన గెలుపు కాదు, మీరు 100 మంది.. నేను ఒక్కడినే’ అని టీఆర్ఎస్ను ఉద్దేశించి ఆయన అన్నారు. సాంకేతికంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినప్పటికీ.. మునుగోడు ప్రజలు తననే గెలిపించారని చెప్పారు. ‘మునుగోడు నియోజకవర్గంలో ధర్మ యుద్ధం జరగలేదు. దుర్మార్గ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎన్నికను ఆధర్మ యుద్ధంగా మార్చారు’ అని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికార దుర్వినియోగం వల్ల తాను కొద్ది తేడాతో ఓడిపోయానని అన్నారు. శుక్రవారం (నవంబర్ 11) మునుగోడులో నిర్వహించిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.
‘మొన్న జరిగిన ఎన్నికల్లో నా కోసం అహర్నిశలు కష్టపడి, పోలీసులు, టీఆర్ఎస్ గూండాలు ఎంత బెదిరించినా, దౌర్జన్యం చేసినా.. ప్రభుత్వం ప్రలోభాలు పెట్టినా, నా గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో జరిగిన ఉప ఎన్నిక భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిదని, యుద్ధాన్ని తలపించేలా జరిగిందని ఆయన అన్నారు. 150 మంది ప్రజాప్రతినిధులు గ్రామానికి ఒకరు చొప్పున ఉండి, ఒత్తిడి తీసుకొచ్చి కొద్దిపాటి మెజారిటీతో గెలిచారని, అది నిజమైన గెలుపు కాదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
‘నేను తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నాతో పాటు ఎంతో మంది నడిచారు. న్యాయంగా, ధర్మంగా రాజగోపాల్ రెడ్డి గెలిచాడని సమాజం మొత్తం చెప్తుంది. యువకులు, మహిళలు చాలా బాధపడుతున్నారు’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
యుద్ధం మిగిలే ఉంది..
మునుగోడులో యుద్ధం ఇంకా పూర్తి కాలేదని.. ఉప ఎన్నికతో మొదలైన యుద్ధం కేసీఆర్ను గద్దె దింపే వరకు కొనసాగుతూనే ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజు ముందే ఉందన్నారు. ‘ఓడిపోయామని భయపడి ఇంట్లో కూర్చునే ప్రసక్తే లేదు’ అని ఆయన అన్నారు.
మునుగోడులో ఓట్ల కోసం గొల్ల కురుమ సోదరులను ప్రభుత్వం మోసం చేసిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రోడ్ల మీదికి వచ్చి ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. నవంబర్ 14న మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో బీజేపీ ఆధ్వర్యంలో గొల్ల కురుమల ఆందోళన ఉంటుందని తెలిపారు.
ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల పనులను వెంటనే మొదలుపెట్టాలని ప్రభుత్వాన్ని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల, చండూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేస్తే మునుగోడు మండలంలో 50,000 ఎకరాలకు నీరు అందుతుందని అన్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని కోరారు.
తాను మళ్లీ 100 శాతం మునుగోడు నుంచే పోటీ చేస్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తెలంగాణలోనే నెంబర్ వన్గా చేసేంతవరకు ఇక్కడే ఉంటానని ఆయన శపథం పూనారు. ‘కేటీఆర్ అహంకారి. జగదీశ్వర్ రెడ్డి ఒక చేతగాని మంత్రి. గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒక దద్దమ్మ’ అని మాజీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.
‘గెలిచినా, ఓడినా.. రాజగోపాల్ రెడ్డి ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుడు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా భారతీయ జనతా పార్టీ తరఫున మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. అభివృద్ధి చేయకపోతే మాత్రం మిమ్మల్ని మునుగోడు నియోజకవర్గంలో అడుగుపెట్టనీయం’ అని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.
రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనదే అని కార్యకర్తలకు రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని అన్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకు సూర్యాపేట నుంచి తన ప్రచారం మొదలు పెడతానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.
‘మొన్న జరిగిన ఎన్నికల్లో నా కోసం అహర్నిశలు కష్టపడి, పోలీసులు, టీఆర్ఎస్ గూండాలు ఎంత బెదిరించినా, దౌర్జన్యం చేసినా.. ప్రభుత్వం ప్రలోభాలు పెట్టినా, నా గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో జరిగిన ఉప ఎన్నిక భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిదని, యుద్ధాన్ని తలపించేలా జరిగిందని ఆయన అన్నారు. 150 మంది ప్రజాప్రతినిధులు గ్రామానికి ఒకరు చొప్పున ఉండి, ఒత్తిడి తీసుకొచ్చి కొద్దిపాటి మెజారిటీతో గెలిచారని, అది నిజమైన గెలుపు కాదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
‘నేను తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నాతో పాటు ఎంతో మంది నడిచారు. న్యాయంగా, ధర్మంగా రాజగోపాల్ రెడ్డి గెలిచాడని సమాజం మొత్తం చెప్తుంది. యువకులు, మహిళలు చాలా బాధపడుతున్నారు’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
యుద్ధం మిగిలే ఉంది..
మునుగోడులో యుద్ధం ఇంకా పూర్తి కాలేదని.. ఉప ఎన్నికతో మొదలైన యుద్ధం కేసీఆర్ను గద్దె దింపే వరకు కొనసాగుతూనే ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజు ముందే ఉందన్నారు. ‘ఓడిపోయామని భయపడి ఇంట్లో కూర్చునే ప్రసక్తే లేదు’ అని ఆయన అన్నారు.
మునుగోడులో ఓట్ల కోసం గొల్ల కురుమ సోదరులను ప్రభుత్వం మోసం చేసిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రోడ్ల మీదికి వచ్చి ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. నవంబర్ 14న మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో బీజేపీ ఆధ్వర్యంలో గొల్ల కురుమల ఆందోళన ఉంటుందని తెలిపారు.
ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల పనులను వెంటనే మొదలుపెట్టాలని ప్రభుత్వాన్ని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల, చండూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేస్తే మునుగోడు మండలంలో 50,000 ఎకరాలకు నీరు అందుతుందని అన్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని కోరారు.
తాను మళ్లీ 100 శాతం మునుగోడు నుంచే పోటీ చేస్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తెలంగాణలోనే నెంబర్ వన్గా చేసేంతవరకు ఇక్కడే ఉంటానని ఆయన శపథం పూనారు. ‘కేటీఆర్ అహంకారి. జగదీశ్వర్ రెడ్డి ఒక చేతగాని మంత్రి. గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒక దద్దమ్మ’ అని మాజీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.
‘గెలిచినా, ఓడినా.. రాజగోపాల్ రెడ్డి ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుడు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా భారతీయ జనతా పార్టీ తరఫున మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. అభివృద్ధి చేయకపోతే మాత్రం మిమ్మల్ని మునుగోడు నియోజకవర్గంలో అడుగుపెట్టనీయం’ అని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.
రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనదే అని కార్యకర్తలకు రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని అన్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకు సూర్యాపేట నుంచి తన ప్రచారం మొదలు పెడతానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.