యాప్నగరం

నల్గొండ: టెన్త్ అమ్మాయి ఇంటికెళ్లిన ఇంటర్ అబ్బాయి.. కొద్దిసేపటికే దారుణంగా!

Nalgonda Murder నల్గొండ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. బాలుడ్ని బాలిక తండ్రి, నాయనమ్మ హత్య చేయడం కలకలంరేపింది. టెన్త్ క్లాస్ చదువుతున్న బాలిక.. ప్రేమ పేరుతో వెంటపడ్డ ఇంటర్ బాలుడు. పెద్దలకు తెలియడంతో షీ టీమ్‌కు ఫిర్యాదు.. పెద్దలతో కూర్చుని రాజీ కూడా చేసుకున్నారు. అయినా బాలుడు పద్దతి మార్చుకోలేదు.. ఈసారి నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ బాలుడ్ని పట్టుకుని ఇద్దరు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 26 May 2023, 1:51 pm

ప్రధానాంశాలు:

  • నల్గొండ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది
  • బాలుడ్ని కొట్టి చంపిన బాలిక కుటుంబసభ్యులు
  • గతంలో పెద్దల దగ్గర పంచాయితీ కూడా చేశారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nalgonda Murder
నల్గొండ జిల్లాలో బాలిక ఇంటికి వెళ్లిన బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్రంపోడు మండలం కొప్పోలుకు చెందిన బాలిక నల్గొండలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉండి పదోతరగతి చదువుతోంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం దుగినెల్లి వాసి, ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. అతడు ప్రేమ పేరిట ఆమె వెంటపడుతున్నాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో గొడవ జరిగింది. బాలికను పేరెంట్స్ ప్రశ్నించడంతో అతడు తనను వేధిస్తున్నట్లు చెప్పింది.
నాలుగు నెలల క్రితం బాలిక తల్లిదండ్రులు షీటీమ్‌ను ఆశ్రయించారు. ఇద్దరి తల్లిదండ్రులు, పెద్ద మనుషుల్ని పిలిచి.. ఒకరి జోలికి ఒకరు వెళ్లకుండా ఉండాలని రాజీ కుదిర్చారు. సంతోష్ తల్లిదండ్రులు ఉపాధి కోసం సూరత్ వెళ్లారు. బాలుడు అక్క దగ్గర ఉంటున్నాడు. ఇంతలో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో బాలిక ఊరిలో ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి బాలిక ఇంట్లోకి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన బాలిక నాయనమ్మ బయటి నుంచి తలుపు గడియ పెట్టింది.
బాలిక తండ్రిని పిలిచింది.. వారిద్దరూ తలుపు తీశారు. అక్కడే ఉన్న బాలుడిని కర్రలతో కొట్టారు. వారి నుంచి తప్పించుకుని పారిపోతున్నా వెంబడించి కొట్టారు. అతడికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. నల్గొండ హైస్కూలులో చదివేటప్పుడే అతడికి ఆ బాలిక పరిచయం ఉందని చెబుతున్నారు. ఆమె కుటుంబసభ్యులు గతంలోనే బాలుడిని హెచ్చరించారట. పెద్దలు చెప్పినా వినకపోవడం.. ఓ బాలిక వెంటపడటంతో ఆమె కుటుంబ సభ్యులు దాడి చేశారని చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.