యాప్నగరం

ఆ మంత్రి రూ.100 కోట్ల స్కాం చేస్తుండు.. సీఎం గారూ.. ఆయనను బర్తరఫ్ చేయండి: కోమటిరెడ్డి రిక్వెస్ట్

అభివృద్ధిని పట్టించుకోని పనికిమాలిన, అవినీతి మంత్రిని జిల్లాకు నియమించారని సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి పదవి నుంచి జగదీశ్ రెడ్డిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

Authored byRaj Kumar | Samayam Telugu 25 May 2022, 3:01 pm
ద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తమ జిల్లాకు పనికిమాలి మంత్రిని, అవినీతి మంత్రిని నియమించారని సీఎం కేసీఆర్‌ను ఆక్షేపించారు. మంత్రి పదవి నుంచి జగదీశ్ రెడ్డిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వివేరా హోటల్ వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి భూఅక్రమాలకు, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు.
Samayam Telugu కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


సూర్యాపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ దందా కోసం కలెక్టరేట్ స్థలాన్ని మార్చి రూ.వందల కోట్లు సంపాదించాడని కోమటిరెడ్డి అన్నారు. ఇప్పుడు తమ సొంత మండల కేంద్రమైన నార్కట్‌పల్లిలో పెద్ద చెరువు భూమిని కబ్జా చేసి వెంచర్ నిర్మించాలని ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. తన బినామీ పార్టనర్‌తో ఈ వ్యవహారమంతా నడిపిస్తున్నారన్నారు. మొత్తం 40 ఎకరాల భూమిని చెరపట్టి మట్టి నింపి దాదాపు రూ.100 కోట్ల స్కామ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు.


దీనిపైన కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో కలసి చెరువులో చేపట్టిన పనులు అడ్డుకొని తామెంటో చూపిస్తామన్నారు కోమటిరెడ్డి.. ఆ అవినీతి మంత్రి జగదీశ్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని సీఎం కేసీఆర్‌ను ఆయన కోరారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.