యాప్నగరం

Munugode: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..?

Munugode: మునుగోడుపై గులాబీ దళపతి కేసీఆర్.. ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా.. మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. అతి త్వరలోనే టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 20 Sep 2022, 3:27 pm

ప్రధానాంశాలు:

  • మునుగోడుపై ఫుల్ ఫోకస్ పెట్టిన గులాబీ దళపతి
  • మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతిభవన్‌లో కీలక భేటీ
  • కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే మళ్లీ అవకాశం ఇచ్చే ఛాన్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Munugode
మునుగోడు ఉప ఎన్నిక
Munugode: తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు కాక రేపుతోంది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ స్థానంపై కన్నేశాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమతమ అభ్యర్థిని ప్రకటించగా.. టీఆర్ఎస్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో.. మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ (TRS) చీఫ్ కేసీఆర్.. ప్రగతి భవన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. కేసీఆర్ పిలుపుతో.. మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హుటాహుటిన ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.
బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో.. త్వరలోనే అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించాలని కేసీఆర్ (CM KCR) భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పార్టీ కేడర్‌కు కూసుకుంట్ల అభ్యర్దిగా సంకేతాలు పంపారు కేసీఆర్. అటు మంగళవారం నుంచి మునుగోడు (Munugode) నియోజకవర్గంలో మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసింది.

ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో కూసుకుంట్ల పేరును హైలైట్ చేయాలని మంత్రి జగదీష్ రెడ్డికి కేసీఆర్ సూచించినట్టు సమాచారం. దీంతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Koosukuntla Prabhakar Reddy) పేరును దాదాపు ఖరారు చేసినట్టే అనే వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ కూడా తన అభ్యర్థిని ప్రకటిస్తే.. ఇక మునుగోడులో రాజకీయం మరింత రంజుగా మారుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే చేరికలు, వరుస మీటింగ్‌లతో మునుగోడు రాజకీయం హాట్ హాట్‌గా మారింది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.