యాప్నగరం

యాదాద్రి: పుష్కరిణిలో మునిగి భక్తుడు మృతి

Yadadri Temple: యాదాద్రి నృసింహ స్వామి పుణ్యక్షేత్రంలో విషాదం చోటు చేసుకుంది. పుష్కరిణిలో స్నానానికి దిగిన ఓ భక్తుడు నీటిలో మునిగి చనిపోయాడు. స్నానం చేస్తుండగా.. అతడికి ఫిట్స్ రావటంతో ప్రాణాలు విడిచాడు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 21 Mar 2023, 2:19 pm

ప్రధానాంశాలు:

  • యాదాద్రి కొండపై విషాదం
  • పుష్కరిణిలో మునిగి భక్తుడు మృతి
  • ఫిట్స్ రావటంతో మృతి చెందిన భక్తుడు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Yadadri Temple
యాదాద్రి టెంపుల్
Yadadri Temple: తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండపై విషాదం చోటు చేసుకుంది. ఆలయ పుష్కరిణిలో మునిగి ఓ భక్తుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అమర చింతల గ్రామానికి చెందిన మౌలాలి (19)నిన్న (సోమవారం) సాయంత్రం తల్లితో పాటు యాదాద్రి దర్శనానికి వచ్చాడు.
రాత్రి కొండపైనే బస చేసి.. ఉదయం 7 గంటల సమయంలో స్నానం చేసేందుకు గాను పుష్కరిణలోకి దిగాడు. పుష్కరిణిలో స్నానం చేస్తుండగా.. మౌలాలికి ఫిట్స్ వచ్చింది. దీంతో అతడు నీటిలో మనిగిపోయాడు. నీటి లోతు తక్కువగానే ఉన్నా.. ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవటంతో నీళ్లలో మునిగి చనిపోయాడు. కాసేపటికి తల్లి వెళ్లి చూడగా.. అతడు విగతజీవిగా పడి ఉన్నాడు.

విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు పుష్కరిణి దగ్గరకు చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భక్తులెవరూ పుష్కరిణి లోపలికి వెళ్లకుండా ఆలయ అధికారులు తాళాలు వేశారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.