యాప్నగరం

సాగర్‌లో దూకి కుటుంబం ఆత్మహత్య

కుమారుడితో కలిసి దంపతులు సాగర్ కెనాల్‌లోకి దూకారు. ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ కూడా రాశారు. ఒకరి మృతదేహం లభ్యం అయ్యింది. మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నారు.

Samayam Telugu 23 Jul 2021, 1:25 pm
నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్‌లో ఓ కుటుంబం దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. రామయ్య, నాగమణి అనే దంపతులకు సాత్విక్ అనే కుమారుడు ఉన్నాడు. వీరి ముగ్గురు కలిసి సాగర్‌లో దూకారు. తమ చావుకు ఎవరూ బాధ్యులు కాదని సూసైడ్ నోట్ కూడా రాశారు. కొత్త బ్రిడ్జి నుండి సాగర్ నదిలోకి దూకి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే తమ చావుకు తామే కారణమని, అనారోగ్యం సమస్యల కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటు న్నామని ఒక సూసైడ్ నోట్ లో రాశారు. పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకుని, ఆ ముగ్గురి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జమ్మన్న కోట తండా వద్ద కృష్ణా నదిలో సాత్విక్ మృతదేహం లభ్యమైంది.. దంపతులైన రామయ్య నాగమణి మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.