యాప్నగరం

నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అధికారులు సకాలంలో స్పందించి మంటల్ని వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Samayam Telugu 4 Jan 2021, 10:17 am
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ట్రాన్స్ ఫార్మర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మంటలు వ్యాపించకుండా నిరోధించారు. ఉద్యోగుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Samayam Telugu సాగర్ పవర్ ప్లాంట్‌లో ప్రమాదం


Read More: తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

గతేడాది శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.ఈ దుర్ఘటనలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈప్రమాదంలో మంటలు భారీగా వ్యాపించడంతో పాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.