యాప్నగరం

Jagadish Reddy: నాకు కేసీఆర్ ఒక్కడే నాయకుడు.. మిగతావారంతా లిల్లీపుట్స్

మునుగోడులో జరిగే పార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు . మంత్రి జగదీశ్‌రెడ్డి కావాలనే తనకు ప్రాధాన్యత దక్కకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తనను పిలవనంత మాత్రాన తన స్థాయి తగ్గిపోయి మంత్రి స్థాయి పెరిగిపోదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్‌లో తనకు కేసీఆర్ ఒక్కరే నాయకుడని.. మిగతా వారంతా లిల్లీపుట్స్‌తో సమానమని బూర నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 27 Sep 2022, 1:39 pm
మునుగోడు ఉపఎన్నిక(Munugode By Election)ను ఓ వైపు టీఆర్ఎస్(TRS) అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే.. మరోవైపు స్థానిక నేతలు ఆధిపత్య పోరుతో కేడర్‌ను గందరగోళానికి గురిచేస్తున్నారు. తనను పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదంటూ భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్(boora narsaiah goud) తాజాగా మండిపడ్డారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్(Choutuppal) మున్సిపాలిటీ కేంద్రంలో నిర్వహిచిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల్లో(laxman bapuji birth anniversary) ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన... మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానిని తనను ఎందుకు పిలవలేదని మంత్రి జగదీశ్‌రెడ్డి(minister jagadish reddy)ని నిలదీశారు.
Samayam Telugu మీడియాతో మాట్లాడుతున్న బూర నర్సయ్యగౌడ్

Jagga Reddy: మూడు రాష్ట్రాలుగా ఏపీ.. వైఎస్ ఫ్యామిలీ నుంచే ముగ్గురు సీఎంలు!
టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి తనను పిలవకపోవడం 3లక్షల మంది మనుగోడు ప్రజలను అవమానించినట్లేనని నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే పార్టీ సమావేశాలకు ఆహ్వానించనంత మాత్రాన తన స్థాయి తగ్గదు.. ఆయన స్థాయి పెరగదని అన్నారు. టీఆర్ఎస్‌లో తనకు కేసీఆర్ ఒక్కరే నాయకుడని.. మిగతా వారంతా లిల్లీపుట్స్‌తో సమానమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో రాజకీయంగా లబ్ధి పొందిన వారు మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయ్యారు... కానీ వాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యక్రమాలను కూడా సొంత కార్యక్రమాల్లా చేస్తామనుకునే వాళ్లకు నష్టం తప్పదని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అహంకారం అనేది వారి సొంత సమాధికి పునాది లాంటిదన్నారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.