యాప్నగరం

భార్యపై దాడి ఆ తర్వాత పురుగుల మందు తాగిన భర్త

భార్య రాములమ్మపై రాడ్‌తో భర్త దాడికి దిగారు. ఆ తర్వాత శ్యామయ్య కూడా పురుగులు మందు తాగాడు. ఇద్దరు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 31 Jan 2021, 12:53 pm

ప్రధానాంశాలు:

  • భార్యపై కోపంతో రాడ్‌తో దాడి
  • ఆ తర్వాత పురుగులు మందు తాగిన భర్త
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu భార్యపై భర్త దాడి
చిన్నపాటి గొడవలకే కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక కష్టాలతో నిత్యం అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొందరు అయితే ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలతో కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో భార్యపై దాడి చేసింది. ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నల్గొండ మండలం బుద్దారం గ్రామంలో భార్య రాములమ్మపై భర్త శ్యామయ్య రాడ్‌తో దాడి చేశాడు.
అనంతరం భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఇరువురిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ దంపతులిద్దరూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త ఏ విషయంలో భార్యపై దాడి చేశాడన్న కోణంలో కూడా దర్యాప్తు చేశారు. క్షణికావేశంలో భార్యభర్తలు చేసిన పనితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో నిండిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.