యాప్నగరం

యాదాద్రి ఆలయానికి ఏపీ నుంచి ప్రత్యేక విగ్రహాలు.. ఏకశిలతో తయారీ

ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని కర్నూలు జిల్లాలో ఆలయం కోసం ప్రత్యేకంగా ఏకశిలలతో విగ్రహాలను తయారు చేయించారు.

Samayam Telugu 20 Jan 2021, 12:02 pm
తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కొత్త రూపును సంతరించుకుంటున్నది.. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న క్రమంలో ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయ నిర్మాణ పనుల్ని చేపడుతోంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగుతున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయంలోని ప్రాకారాలను చూసే భక్తులు తన్మయత్వం చెందేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
Samayam Telugu యదాద్రి ఆలయం
yadadri temple


అద్భుతమైన కళాఖండాలతో నిర్మితమవుతున్న ఆలయ గోపురాలు, ప్రాకారాలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే గుట్ట చుట్టూ పచ్చదనం భక్తులకు ఆహ్లాదం పంచుతోంది. ఈ క్రమంలో ఆలయం ద్వితీయ ప్రాకారం వెలుపల సాలహారాల్లో మొత్తం 140 విగ్రహాలను అమర్చాలని వైటీడీఏ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కోయిలకుంటలో ఏకశిలలతో సాలహార విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. మంగళవారం ఉదయం 32 సాలహార విగ్రహాలను యాదాద్రి క్షేత్రానికి తరలించారు. మిగతా 108 విగ్రహాలను సైతం త్వరలో తీసుకురానున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.

Read More: జగన్ నిర్ణయానికి కేసీఆర్ చెక్.. విశాఖలో వద్దన్న సీఎం

సాలహార విగ్రహాలను అమర్చే పనులు త్వరలో చేపట్టనున్నట్టు వైటీడీఏ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే 99 శాతం ఆలయ పనులు పూర్తయ్యాయి. త్వరలో ఆలయం ప్రారంభం కూడా జరగనుంది. జనవరి, ఫిబ్రవరిలో మహా సుదర్శన యాగం జరిపి... అత్యద్భుతంగా యాదాద్రి ఆలయాన్ని ప్రారంభంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు ఆలయ పనులకు సంబంధించి అధికారులతో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.