యాప్నగరం

నల్గొండలో యువకుడి హత్య... అర్ధరాత్రి బండరాళ్లతో కొట్టి దారుణం..

తెలంగాణలోని నల్గొండ పట్టణంలో కొత్త సాయి అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. పాత కక్షలతో దుండగులు బండరాళ్లతో తలపై కొట్టిన దుండగులు అతడి ప్రాణాలు తీసేశారు.

Samayam Telugu 15 Jan 2021, 12:49 pm
నల్గొండ పట్టణంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణానికి చెందిన కొత్త సాయి అనే యువకుడిని కొందరు దుండగులు రైల్వేస్టేషన్‌ సమీపంలో బండరాళ్లతో కొట్టి చంపేశారు. సాయి మృతదేహాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు.
Samayam Telugu Image


సాయి అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాత కక్షలతో ప్రత్యర్థులే అతడిని చంపేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై నల్గొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ హత్య జరగడంతో నగరంలో కలకలం రేపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.