యాప్నగరం

తమ్ముడ్ని వెంటాడి మరీ చంపిన అన్న.. రక్తపుమడుగులో శవం, కారణం ఏంటంటే..

Nalgonda: లాక్‌డౌన్‌ సమయంలో గ్రామానికి వచ్చిన కృష్ణయ్య నీకు భూమిని అమ్మలేదని వెంకటయ్యతో వాగ్వాదానికి దిగాడు. వీరి ఇరువురి మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి.

Samayam Telugu 26 Jan 2021, 10:39 pm
భూమి వివాదంతో తమ్ముడిని అన్న హత్య చేశాడు. నాంపల్లి మండలంలోని బండ తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని తాటిమీదిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బొదాసు కృష్ణయ్య తన తమ్ముడు అయిన బొదాసు వెంకటయ్య(55)కు తొమ్మిదెకరాల భూమిని ఎనిమిదేళ్ల క్రితం అమ్ముకుని హైదరాబాద్‌కు వలసవెళ్లాడు. లాక్‌డౌన్‌ సమయంలో గ్రామానికి వచ్చిన కృష్ణయ్య నీకు భూమిని అమ్మలేదని వెంకటయ్యతో వాగ్వాదానికి దిగాడు. వీరి ఇరువురి మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. కాగా వెంకటయ్య కుమారుడు భాస్కర్‌ వ్యవసాయ పనులు చేస్తుండగా బొదాసు కృష్ణయ్యతోపాటు అతని కుమారులు భాస్కర్‌ వద్దకు వెళ్లి గొడవకు దిగి.. దాడికి యత్నించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


దీంతో భాస్కర్‌ గ్రామంలోకి పరుగు తీశారు. భాస్కర్‌ను వెంబడిస్తున్న విషయాన్ని తెలుసుకున్న వెంకటయ్య తన అన్న, అన్న కొడుకులను అడ్డుకున్నాడు. దీంతో వారు వెంకటయ్యపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో ఉన్న వెంకటయ్యను స్థానికులు 108 ద్వారా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు. వెంకటయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.