యాప్నగరం

మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే.. హైవోల్టేజ్ సీన్.. అస్సలు తగ్గని టీఆర్‌ఎస్, కాంగ్రెస్!

రేషన్ కార్డుల పంపిణీ వ్యవహారం టీఆర్‌ఎస్ మంత్రి వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మారింది. ఇరువర్గాల హోరాహోరీ నినాదాలు.. కుర్చీల విసురులాటతో రణరంగాన్ని తలపించింది.

Samayam Telugu 26 Jul 2021, 5:49 pm
యాదాద్రి భువనగిరి జిల్లాలో హైడ్రామా నడిచింది. టీఆర్‌ఎస్ మంత్రి వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నడుమ హైవోల్జేజ్ సీన్ చోటుచేసుకుంది. ఇరుపార్టీల కార్యకర్తల నినాదాలతో హాల్ మార్మోగిపోయింది. ప్రొటోకాల్ వివాదం చినికిచినికి గాలివానగా మారి తోపులాటకు దారితీసింది. చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేదికపై వచ్చే సమయంలో ఇరుపార్టీల నేతలు గట్టిగా నినాదాలు చేశారు. హోరాహోరీ నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Samayam Telugu ఇద్దరు నేతల ఫైట్
nalgonda


మునగోడు నియోజకవర్గంలో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ కాంగ్రెస్ వర్గీయులు తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డితో ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఒకానొక దశలో అసహనానికి గురైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి చేతిలోని మైక్‌ని గుంజుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ సీన్‌తో హాల్‌లో అలజడి చెలరేగింది. కార్యక్రమం రసాభాసగా మారింది. ఇద్దరు నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగడంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా కుర్చీలు విసురుకుని బాహాబాహీకి దిగడంతో రణరంగాన్ని తలపించింది.

Also Read: అవ్వ పెట్టది.. అడక్కు తిననీయది కేసీఆర్ దొర.. షర్మిల ఘాటు పంచ్‌లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.