యాప్నగరం

సూర్యాపేటలో కోతుల బీభత్సం.. పక్షవాతంతో ఉన్న వృద్ధురాలిపై దాడి.. మంచంపైనే కన్నుమూత

అడవుల్లో ఉండాల్సిన కోతులు (Monkeys) ఈ మధ్య జనావాసాల్లో విచ్చల విడిగా సంచరిస్తున్నాయి. పల్లెటూళ్లలో ఎక్కడ చూసిన అవే దర్శనమిస్తున్నాయి. గుంపులు గుంపులుగా చేరి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఒంటరిగా ఉన్న వారిపై దాడికి పాల్పడుతున్నాయి. సూర్యాపేట జిల్లా పాత సూర్యాపేట గ్రామంలో కోతులు బీభత్సం సృష్టించాయి. పక్షవాతంతో మంచంపై కదల్లేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిపై కోతుల గుంపు దాడికి దిగింది. ఈ ఘటనలో వృద్ధురాలు మంచంపైనే ప్రాణాలు విడిచింది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 27 Sep 2022, 1:39 pm
అడవుల్లో ఉండాల్సిన కోతులు (Monkeys) ఈ మధ్య జనావాసాల్లో విచ్చల విడిగా సంచరిస్తున్నాయి. పల్లెటూళ్లలో ఎక్కడ చూసిన అవే దర్శనమిస్తున్నాయి. గుంపులు గుంపులుగా చేరి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇంటి గోడలపై, చెట్లపై అటూ ఇటూ దూకుతూ వస్తువులను నాశనం చేస్తున్నాయి. వాటిని తరమిందేకు ప్రయత్నించిన వారిపై దాడికి తెగబడుతున్నాయి. తాజాగా సూర్యపేట జిల్లాలో (Suryapet District) ఓ వృద్ధురాలిపై కోతి మూక దాడికి దిగింది.
Samayam Telugu monkeys new
కోతుల దాడి


జిల్లాలోని ఆత్మకూరు (ఎస్) మండలం పాత సూర్యపేటకు (Pata Suryapet) చెందిన మెట్టు లింగమ్మకు ఇటీవల పక్షవాతం సోకింది. అప్పటి నుంచి కదల్లేని స్థితిలో ఆమె మంచానికే పరిమితమయ్యింది. దీంతో ఆమె కుమారుడు శంకర్ రెడ్డి ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేశాడు. ఊరు చివర్లో వృద్ధురాలి ఇళ్లు ఉండటం, శంకర్ రెడ్డి తన భార్యతో కలిసి పొలం పనులకు వెళ్లటంతో లింగమ్మ ఒంటరిగా ఉంట్లోనే ఉంది. అటుగా వచ్చిన కోతుల గుంపు మంచంపై కదల్లేని స్థితిలో ఉన్న ఆమెపై (Monkeys Attack) దాడికి పాల్పడ్డాయి. తీవ్ర గాయాలపాలైన లింగమ్మ మంచంపైనే ప్రాణాలు కోల్పోయింది. అటుగా వెళ్లిన గ్రామస్తులు గమనించి కుమారుడు శంకర్ రెడ్డికి సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న శంకర్ రెడ్డి దంపతులు జరిగిన ఘోరాన్ని చూసి బోరున విలపించారు.

కోతుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఇంటిపై, ఇంటి ఆవరణలో ఉన్న వస్తువులు, చెట్లను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు డబ్బులు చెల్లించి కోతులు పట్టేవారిని పిలిపిస్తున్నామని.., వారు వాటిని పట్టుకుని అడవుల్లో వదిలి పెట్టినా.., తిరిగి ఊర్లోకి వచ్చి చేరుతున్నాయన్నారు. వాటి బాధ నుంచి తప్పించుకునేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం ఉండట్లేదని వాపోతున్నారు. తమ పొలాల్లో పంటలను (Crop Damage) కూడా నాశనం చేస్తూ తీవ్ర నష్టం చేకురుస్తున్నాయని అన్నారు. ఒంటిరిగా వెళ్లే వారిపై దాడికి పాల్పడి గాయపరిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.