యాప్నగరం

విషాదం.. పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

ముగ్గురు కూతుర్లకు ఉరివేసి తల్లికూడా ఆత్మహత్యకు పాల్పడింది. అయితే 8 ఏళ్ల చిన్న కూతురు ఉరి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 8 Jul 2021, 8:19 am
యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చౌటుప్పల్ మండల కేంద్రంలో ముగ్గురు ఆడ పిల్లలకు ఉరి వేసి తల్లి కూడా ఆత్మ హత్య చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న తొర్పునురి ఉమ రాణి (31) కూతుర్లు హర్షిని (13), లక్కీ (11) ఉరివేసింది. ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే చిన్న కూతురు శైని (8) ఉరి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయట పడింది
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లి పిల్లలు ఆత్మహత్య కు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.