యాప్నగరం

'హాత్విక్‌ను దత్తత తీసుకుంటా'.. మంచి మనసు చాటుకున్న కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కుషాయిగూడ అగ్ని ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన హాత్విక్‌ను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. చిన్నారిని సొంత కుమారుడిలా చూసుకుంటానని.., టాప్ స్కూల్‌లో చేర్పించి అందుకు అయ్యే ఖర్చును పూర్తిగా తానే భరిస్తానని చెప్పారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 18 Apr 2023, 1:13 pm

ప్రధానాంశాలు:

  • హాత్విక్‌ను దత్తత తీసుకుంటా
  • ఆ చిన్నారి పూర్తి బాధ్యత నాదే
  • మరోసారి మంచి మనసు చాటుకున్నకోమటిరెడ్డి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Komatireddy Venkat Reddy
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయాల్లో ఎంత దూకుడుగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయాల్లోనే కాదు ఎదుటివారికి సాయపడటంలోనూ ముందుటారనే టాక్ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. వారి సమస్యలు పరిష్కరిస్తారనే పేరుంది. సాయం చేయమని ఆయన గుమ్మం తట్టిన వారిని ఆదుకోవటంలో ఏ మాత్రం వెనకడుగు వేయరని పేరుంది. తాజాగా.. ఆయన మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
రెండ్రోజుల క్రితం కుషాయిగూడ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన నరేశ్ కుమారుడు హాత్విక్‌ను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. చిన్నారి గురించి ఆలోచన వద్దని తన సొంత కుమారుడిలా చూసుకుంటానని చెప్పారు. ఢిల్లీలో ఉన్న ఆయన తన పీఏ ద్వారా నరేశ్ కుమారుడు హాత్విక్ పేరిట రూ. లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న నరేశ్ తల్లికి ఖర్చుల నిమిత్తం మరో రూ. 25 వేలు పంపించారు. నరేశ్ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారికి ధైర్యం చెప్పారు.

"హైదరాబాద్‌ కుషాయిగూడ అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనం కావటం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఢిల్లీలో ఉన్న కారణంగా నరేశ్ తండ్రితో ఫోన్‌లో మాట్లాడాను. కన్న కొడుకు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయనకు.. ఇకపై హాత్విక్‌లో నరేశ్‌ను చూసుకోమని ధైర్యం చెప్పాను. బాలుడి గురించి ఆలోచించవద్దని నా సొంత కుమారుడిలా చూసుకుంటానని చెప్పాను. బాలుడి మేనత్తలు హైదరాబాద్‌లో ఉంటారని తెలిసింది. అక్కడే దగ్గరలో హాస్టల్‌లో ఉంచి చదివిస్తాను. టాప్ స్కూల్‌లో చదివించే బాధ్యత నాది. చదువుకు అయ్యే ఖర్చంతా భరిస్తానని.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని వారితో చెప్పాను." అని కోమటిరెడ్డి ట్వీట్ చేశారు.

ఓకే కుటుబంలో ముగ్గురు మృతి..
హైదరాబాద్‌ కుషాయిగూడలో ఆదివారం రాత్రి 3 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టింబర్ డిపోలో మంటలు చేలరేగి పక్కనే బిల్డింగ్‌లోకి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో భవనంలో అద్దెకు ఉంటున్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన నరేశ్‌(35), అతని భార్య సుమ(35), వారి కుమారుడు జశ్విత్‌(6) సజీవ దహనమయ్యారు. నరేశ్ దంపతుల పెద్ద కుమారుడు హాత్విక్.. ఆ రోజు పక్క కాలనీలో ఉన్న మేనత్త ఇంట్లో పడుకోవటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. తల్లిదండ్రులను కోల్పోయి హాత్విక్ దిక్కులేని వాడిగా మిగిలిపోగా.. ఆ చిన్నారిన సొంత కొడుకులా చూసుకుంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందుకు వచ్చారు. దీంతో కోమటిరెడ్డిపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మనసున్న మారాజు అని కొనియాడుతున్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.