Munugode Bypoll: ఈటలపై మునుగోడు బీజేపీ నేతల గుస్సా... అధిష్ఠానానికి ఫిర్యాదు
మునుగోడు బీజేపీలో ఈటల రాజేందర్ వ్యవహారం కలకలం రేపుతోంది. చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డిని పార్టీలో చేర్చుకున్న వ్యవహారంలో ఈటలపై స్థానిక బీజేపీ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ప్రధానాంశాలు:
- ఈటల రాజేందర్పై మునుగోడు బీజేపీ నేతల గుస్సా
- బండి సంజయ్కి ఫిర్యాదు చేసిన నేతల
- పార్టీ గెలుపు కోసం సర్దుకుపోవాలని సంజయ్ సూచన
హుజురాబాద్ ఎమ్మెల్యే(Huzurabad), బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్(Etela Rajender) తీరుపై మునగోడు(Munugode) బీజేపీ నేతలు గుస్సా అవుతున్నారు. టీఆర్ఎస్(TRS)కు చౌటుప్పల్(Choutuppal) ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి(taduri venkat reddy)ని పార్టీలో చేర్చుకున్నందుకు మునుగోడు నేతలు ఈటలపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay Kumar)కి ఆయనపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తాడూరిపై అనేక కేసులున్నాయని, అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని ప్రభుత్వ అవినీతి, అక్రమాలు గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతారని వారు రాష్ట్ర అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
తాడూరి వెంకట్రెడ్డి(taduri venkat reddy)ని వదిలించుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తే.. ఆయనకు కండువా కప్పి బీజేపీలో చేర్చుకోవడం సరైన పరిణామం కాదని మునుగోడు బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయన చేరికపై స్థానిక నేతలకు సమాచారం ఇవ్వలేదని, తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తిని ఈటల తన వెంట తిప్పుకుంటున్నారని మునుగోడు బీజేపీ నేతలు అధిష్ఠానం వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. వెంకట్రెడ్డి చేరికపై కనీసం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కూడా సమాచారం ఇవ్వకపోవడం ఆయన్ని అవమానించడమేనని బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారట. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాడుతున్న బీజేపీలో తాడూరి వెంకట్రెడ్డి లాంటి వ్యక్తిని చేర్చుకుంటనే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని స్థానిక నేతలు బండి సంజయ్కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన బండి సంజయ్.. మునుగోడు ఉపఎన్నికలు పార్టీకి చాలా కీలకమని, విబేధాలు పక్కనబెట్టి అందరూ గెలుపు కోసం పాటుపడాలని సంజయ్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ గెలిస్తే ఇలాంటి విషయాన్ని చాలా చిన్నవిగా కనిపిస్తాయని, అందువల్ల పార్టీకి నష్టం కలిగించేలా నేతలెవరూ ప్రవర్తించొద్దని కోరినట్లు సమాచారం. పార్టీ అధినేత సర్దిచెప్పడంతో మునుగోడు బీజేపీ నేతలు వెనక్కి తగ్గి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
తాడూరి వెంకట్రెడ్డి(taduri venkat reddy)ని వదిలించుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తే.. ఆయనకు కండువా కప్పి బీజేపీలో చేర్చుకోవడం సరైన పరిణామం కాదని మునుగోడు బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయన చేరికపై స్థానిక నేతలకు సమాచారం ఇవ్వలేదని, తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తిని ఈటల తన వెంట తిప్పుకుంటున్నారని మునుగోడు బీజేపీ నేతలు అధిష్ఠానం వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. వెంకట్రెడ్డి చేరికపై కనీసం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కూడా సమాచారం ఇవ్వకపోవడం ఆయన్ని అవమానించడమేనని బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారట.