ఈ వేసవి కాలానికి తోడు ప్రచారం వేడికి కొద్ది రోజులుగా కాస్త హడావుడిగా ఉన్న నాగార్జున సాగర్లో ఉప ఎన్నిక ముగిసింది. ఈ ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదు కావడం విశేషం. సాయంత్రం 5 గంటల వరకు 81.5 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకే పార్టీ ప్రతినిధులను అనుమతించారు. ఓటరు రసీదులు సిబ్బంది నుంచి మాత్రమే తీసుకోవాలని ఈసీ ఆదేశించినందున పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి తక్కువగా కనిపించినట్లుగా అధికారులు చెప్పారు. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్ల పోలింగ్ పూర్తయింది. ఆ తర్వాత సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కరోనా బాధితులకు ఓటు వేసే అవకాశం కల్పించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో 41 మంది అభ్యర్థులు నిలిచిన సంగతి తెలిసిందే. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. వీరి భవితవ్యం ఆ రోజు తేలనుంది.
సాయంత్రం ఆరు గంటల సమయానికి ఓటింగ్ 84.32 శాతం మంది ఓటర్లు ఓటు వేశారని అధికారులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రజలంతా ఓట్లు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 69 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 53.3 శాతం పోలింగ్ నమోదు అయ్యినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
సాయంత్రం ఆరు గంటల సమయానికి ఓటింగ్ 84.32 శాతం మంది ఓటర్లు ఓటు వేశారని అధికారులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రజలంతా ఓట్లు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 69 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 53.3 శాతం పోలింగ్ నమోదు అయ్యినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.