యాప్నగరం

నల్గొండ: పిల్లలు పుట్టట్లేదని భర్త కిరాతకం.. ఇంట్లో నుంచి పొగలు, వచ్చి చూస్తే షాక్

Nalgonda: పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ శివారు అక్కలాయిగూడానికి చెందిన పరశురామ్‌ మున్సిపాలిటీలో కింది స్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి చిట్యాల మండలం తాళ్లవెల్లెంలకు చెందిన జ్యోతితో 14 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది.

Samayam Telugu 23 Mar 2021, 10:14 pm

ప్రధానాంశాలు:

  • పిల్లలు పుట్టడం లేదని భార్యపై భర్త అమానుషం
  • నిద్రిస్తున్నప్పుడు పెట్రోల్ పోసి నిప్పు
  • అనంతరం పరారీ, వెతుకుతున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
nalgonda husband kills wife
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. పిల్లలు పుట్టడం లేదనే ఉక్రోషంతో ఓ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. సంతానం కలగకపోవడానికి భార్యే కారణమని భావించిన ఆయన ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. భార్య నిద్ర పోతుండగా ఈ కిరాతకానికి పాల్పడడం గమనార్హం. దీంతో ఆమె చనిపోయింది. పూర్తి వివరాలివీ..
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ శివారు అక్కలాయిగూడానికి చెందిన పరశురామ్‌ మున్సిపాలిటీలో కింది స్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి చిట్యాల మండలం తాళ్లవెల్లెంలకు చెందిన జ్యోతితో 14 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి అప్పటి నుంచి పిల్లలు పుట్టలేదు. అంతేకాక, కుటుంబ కలహాల కారణంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయి.

గత ఆదివారం రాత్రి కూడా ఇదే విషయంపై భార్యభర్తల మధ్య తగాదా జరిగింది. రాత్రి ఫూటుగా మద్యం తాగిన పరశురామ్‌ ఉదయాన్నే నిద్ర లేచాడు. గాఢ నిద్రలో ఉన్న భార్యపై పెట్రోల్‌ పోసి అగ్గిపుల్ల అంటించి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ఇంటి నుంచి పొగ వస్తుండడం గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే, అప్పటికే జ్యోతి చనిపోయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.