యాప్నగరం

తక్కువ ధరకే బంగారం... నల్గొండ వాసికి రూ.11లక్షల టోకరా

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని నమ్మించి నల్గొండకు చెందిన వ్యక్తి నుంచి రూ.11లక్షలు కొట్టేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Samayam Telugu 13 Jan 2021, 11:08 am
మాయమాటలతో ఓ వ్యక్తిని నమ్మించి రూ.11లక్షలు దోచుకున్న ఇద్దరు కేటుగాళ్లను నల్లొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నల్గొండలోని శాంతినగర్‌కు చెందిన సైదాకు కొంతకాలం క్రితం హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన బీరెల్లి సందీప్‌ కుమార్‌, ఉప్పల్‌కు చెందిన గొట్టిముక్కల సురేష్‌ పరిచయమయ్యారు. సైదా వద్ద భారీగా డబ్బున్న సంగతి తెలుసుకున్న వీరిద్దరూ ఓ కన్నింగ్ ప్లాన్ వేశారు.
Samayam Telugu పోలీసుల అదుపులో నిందితులు


Also Read: క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న ఘటన... ఖమ్మంలో అదృశ్యమైన రాజశ్రీ ఏమైంది?

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని, ఓ కంపెనీకి సంబంధించి కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించి పలు విడతలుగా రూ.11 లక్షల వరకు వసూలు చేశారు. అప్పటినుంచి వారు తప్పించుకుని తిరుగుతుండటంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు నల్లొండ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సందీప్, సురేష్ గతంలోనూ పలువురిని ఇదే కోవలో మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.


Also Read: వరంగల్: భర్తను బ్యాంకులోనే చితకబాదిన మహిళ.. కారణం తెలిస్తే షాకవుతారు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.