యాప్నగరం

Dindi Reservoir: జాలువారుతున్న జల్లులను చూస్తూ.. ప్రాణాలు పోగొట్టుకున్న యువకులు

విహార యాత్ర విషాదంగా ముగిసింది. దైవదర్శనానికి వెళ్లిన యువకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సెల్ఫీ మోజులో ప్రాణాలు పోగొట్టుకున్నారు. డిండి రిజర్వాయర్ వద్ద జరిగిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

Samayam Telugu 17 Oct 2021, 5:43 pm
స్మార్ట్ ఫోన్ యుగంలో సెల్ఫీ ఓ వ్యసనమైపోయింది. అందరి కంటే భిన్నంగా కనిపించాలనే అత్యుత్సాహంతో యువత ప్రమాదాలను పట్టించుకోకుండా సెల్ఫీల కోసం పరిగెత్తి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొండలు.. గుట్టలు.. వాగులు.. వంకలు.. ఎక్కడపడితే అక్కడ సెల్ఫీల కోసం ఆరాటపడుతున్నారు. ఆ అత్యుత్సాహమే ఇద్దరు యువకులను పొట్టనబెట్టుకుంది. సెల్ఫీ మోజులో ప్రమాదాన్ని పట్టించుకోకుండా వెళ్లి నీటమునిగి ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా డిండి రిజర్వాయర్ వద్ద జరిగింది.
Samayam Telugu డిండి వద్ద ప్రమాదం
dindi


సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కి చెందిన సాగర్, ప్రవీణ్ అనే ఇద్దరు యువకులు శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో డిండి జలాశయం చూసొద్దామని వెళ్లారు. ప్రాజెక్టు పైనుంచి జాలువారుతున్న జలపాతాన్ని చూసి పరవశించిపోయి సెల్ఫీలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. సెల్ఫీ తీసుకునేందుకు జలాశయం వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ జలాశయంలో పడిపోయారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో వెంటనే నీటమునిగారు. స్థానికులు స్పందించి వారిని బయటికి తీసుకొచ్చేలోపే అనర్థం జరిగిపోయింది. ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.