యాప్నగరం

ప్రేమ పెళ్లి.. ఐదునెలలకే నవవధువు ఆత్మహత్య

నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. పెద్దలను ఒప్పించి ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లైన కొన్నిరోజులకే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.

Samayam Telugu 3 Jan 2021, 11:03 am
ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు మళ్లీ పెరుగుతున్నాయి. కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసకుంది. కోటి ఆశలతో కొత్త జీవింత ప్రారంభించని ఆ యువతికి భర్త వేధింపులు ప్రాణం తీసుకునేలా చేశాయి. వివరాల్లోకి వెళ్తే... నల్లగొండ జిల్లా కొర్లపహాడ్ చెందిన లావణ్య,సూర్యాపేట చర్చకంపౌండ్ కు చెందిన ప్రణయ్ ను 5నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. కోటి ఆశలతో ఇద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇరు కుటుంబాల పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.
Samayam Telugu నవవధువు ఆత్మహత్య


Read More: Hyderabad Biryani: బిర్యానీలో బొద్దింక.. తిన్నవారికి షాక్

అయితే పెళ్లైన కొన్నిరోజులకే లావణ్యకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం తీసుకు రావాలని భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిన లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఇంట్లో కొర్లపాడు గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.