యాప్నగరం

ఉరికొయ్యకు మరో వీఆర్‌ఏ.. తెలంగాణలో విషాదం

Miryalaguda VRA: తెలంగాణలో వీఆర్‌ఏల విషాద గాథలు కొనసాగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులకు తాలలేక మరో వీఆర్‌ఏ ఉరికొయ్యకు వేలాడాడు. మిర్యాలగూడలోని ఊట్లపల్లిలో ఈ విషాదం చోటు చేసుంది. జీతాలు పెంచాలంటూ వీఆర్‌ఏలు కొంత కాలంగా చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో బాధితుడు వెంకటేశ్వర్లు చురుగ్గా పాల్గొన్నారు. వారం రోజుల కిందట కామారెడ్డిలో వీఆర్‌ఏ అశోక్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో ప్రకంపనలు రేపింది. తాజాగా మరో వీఆర్‌ఏ బలవన్మరణానికి పాల్పడటంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 10 Sep 2022, 9:19 pm
తెలంగాణలో మరో వీఆర్‌ఏ బలవన్మరణానికి పాల్పడ్డారు. మిర్యాలగూడలోని ఊట్లపల్లికి చెందిన VRA వెంకటేశ్వర్లు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. జీతం చాలక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. వెంకటేశ్వర్లు మృతితో ఆయన కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా వీఆర్‌ఏలు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో వెంకటేశ్వర్లు చురుగ్గా పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.
Samayam Telugu VRA Deaths in Telangana
ప్రతీకాత్మక చిత్రం


‘మరో వీఆర్ఏ ప్రాణం పోయింది.
వీఆర్ఏ వెంకటేశ్వర్లు బతకలేక,
బతుకు తెరువు గ్యారెంటీ లేక,
ఉరికొయ్యకు శవమై వేలాడాడు.
వీఆర్ఏలకు బతుకు భరోసా ఇవ్వలేని కేసీఆర్ బంగారు భారత జపం చేస్తున్నాడు. జాగో తెలంగాణ!’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్ భాస్కర్ రావు.. వీఆర్‌ఏ వెంకటేశ్వర్లు మృతి చెందిన విషయం తెలుసుకొని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించేందుకు రాగా.. స్థానికులు అడ్డుకున్నారు. వీఆర్‌ఏలు ధర్నాలు చేస్తుంటే పట్టించుకోలేదు గానీ.. ఇప్పుడు ప్రాణం పోయాక వచ్చారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కామారెడ్డి జిల్లాలో వీఆర్‌ఏ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో ఇప్పటికే ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన VRA కోరబోయిన అశోక్‌ (28 ఏళ్లు) సెప్టెంబర్ 3 రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. పేస్కేల్‌ అమలు చేయాలనే డిమాండ్‌తో వీఆర్‌ఏలు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో 42 రోజుల పాటు అశోక్ చురుగ్గా పాల్గొన్నారు. పేస్కేల్‌ అమలు కాకపోవడమే కాకుండా, సమ్మె కాలానికి జీతం కూడా రాకపోవడంతో అశోక్ మనస్తాపానికి గురయ్యారు. అప్పుల బాధతో ఒత్తిడికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.