యాప్నగరం

చనిపోయిన పేషంట్ ఒంటిపై నగలు మాయం.. ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం

గుండెనొప్పితో బాధపడుతున్న మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు వచ్చి చూసేప్పటికి ఒంటిపై నగలు కూడా మాయమయ్యాయి.

Samayam Telugu 25 Apr 2022, 9:25 pm
పక్కోడిని దోచుకునేందుకు కాచుక్కూర్చునే రాబంధులను చూస్తూ ఉంటాం.. కానీ చనిపోయాక శవాన్ని కూడా వదలకుండా ఒంటిపై నగలు మాయం చేసేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. గుండెనొప్పని ఆస్పత్రికెళ్తే ప్రాణం పోవడంతో పాటు ఒంటిపై నగలు కూడా మాయమయ్యాయి. అదేంటని అడిగితే తమకేం సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఆస్పత్రి సిబ్బంది. ఈ అమానుష ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.
Samayam Telugu gold


భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన లలిత అనే మహిళకు గుండెపోటు రావడంతో వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే ఆమె కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. అయితే చనిపోయిన లలిత ఒంటిపై ఉండాల్సిన నగలు ఆస్పత్రిలోనే మాయమయ్యాయి. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చి చూసే సరికి ఒంటిపై నగలు కనిపించకపోవడంతో కంగుతిన్నారు.

ఏమైందని అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే తమకేమీ తెలియదంటూ సమాధానమిచ్చారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందే నగలు మాయం చేశారని ఆరోపిస్తున్నారు. తమకేమీ తెలియదని ఆస్పత్రి సిబ్బంది సమాధానం చెబుతున్నారు. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. చనిపోయిన శవంపై ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించారని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.