యాప్నగరం

ఫోన్‌ అన్‌లాక్‌ తీయించిన తమ్ముడు.. ఖననం చేసిన 22 రోజులకు అన్న డెడ్ బాడీ బయటికి తీసి పోస్ట్‌మార్టం

Nalgonda: ఖననం చేసిన డెడ్ బాడీని బయటికి తీసి 22 రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని సింగరాజుపల్లి గ్రామంలో శుక్రవారం ఇది జరిగింది..

Samayam Telugu 12 Feb 2022, 2:17 pm
ఖననం చేసిన మృతదేహాన్ని బయటికి తీసి 22 రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని గుడిపల్లి గ్రామపంచాయతీ సింగరాజుపల్లి గ్రామంలో శుక్రవారం ఇది జరిగింది..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


వివరాల్లోకి వెళ్తే.. సింగరాజుపల్లి గ్రామానికి చెందిన రొయ్య నాగమ్మ, సోమయ్యల కుమారుడు యాదగిరి (34) హైదరాబాద్‌లోని హస్తినాపురంలో ఫొటోస్టూడియో నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.. అయితే జనవరి 17వ తేదీ ఉదయం ఫోన్‌ రావడంతో ఇంటి నుంచి యాదగిరి బయటకెళ్లాడు.. అనంతరం సాయంత్రానికి తిరిగొచ్చాడు. ఈ క్రమంలోనే కడుపులో తీవ్రంగా నొప్పి రాగా భార్య విజయలక్ష్మికి చెప్పడంతో వెంటనే ఉస్మానియా ఆస్పత్రిలో యాదగిరిని చేర్చింది.. అయితే చికిత్స పొందుతూ జనవరి 18వ తేదీ రాత్రి యాదగిరి మృతి చెందాడు. అదేరోజు మృతదేహాన్ని ఖననం చేశారు.

ఈ నేపథ్యంలోనే మృతుడు యాదగిరి ఫోన్‌ లాక్‌ ఉండటంతో అతని తమ్ముడు వెంకటేశ్ ఇటీవల ఫోన్‌ అన్‌లాక్‌ చేయించాడు. అయితే అందులో స్నేహితులతో గొడవకు సంబంధించి ఫోన్‌లో రికార్డు అయింది. దీంతో యాదగిరిపై దాడి చేయడం వల్లే మృతి చెందాడని అనుమానం వ్యక్తం చేస్తూ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో కుటుంబసభ్యులు ఈ నెల 9న ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే బాధితుల ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీదేవి సమక్షంలో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని బయటికి తీశారు. అనంతరం దేవరకొండ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ క్రమంలోనే పోస్టుమార్టం రిపోర్ట్స్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.