యాప్నగరం

డీపీగా క్లాస్‌‌మెట్ ఫొటో.. లెక్చరర్‌పై లెటర్ రాసి స్టూడెంట్ సూసైడ్!

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. లెక్చరర్ క్లాస్‌లో అవమానించడంతో పాటు బెదిరించారనే కారణంతో విద్యార్థి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాట్సాప్ డీపీగా క్లాస్‌మెట్ ఫొటో పెట్టుకున్నాడని.. ఆ ఫొటో తీయకపోతే పోలీసులకు చెప్తానంటూ హెచ్చరించడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని సూసైడ్ లెటర్‌లో రాసి మరీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Edited byరావు | Samayam Telugu 19 Sep 2022, 1:57 pm

ప్రధానాంశాలు:

  • మొబైల్ ఫోన్‌లో వాట్సాప్ డీపీగా క్లాస్‌మెట్ ఫొటో
  • డీపీ మార్చాలంటూ హెచ్చరించిన మ్యాథ్స్ లెక్చరర్
  • బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu student
ప్రతీకాత్మక చిత్రం
క్లాస్‌మెట్ ఫొటో వాట్సాప్ డీపీగా పెట్టుకున్న విద్యార్థిని అందరి ముందు లెక్చరర్ అడిగారన్న అవమానంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి అధ్యాపకుడే కారణమంటూ లెటర్ రాసి తీవ్ర మనస్తాపంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మరణానికి కారణమైన లెక్చరర్‌ని సస్పెండ్ చేయాలంటూ ఎస్‌ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
భూదాన్ పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన ఆకాశ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. మ్యాథ్స్ క్లాస్ జరుగుతున్న సమయంలో పాఠం వినకుండా ఫోన్ చూస్తుండటంతో.. లెక్చరర్ ఆకాశ్ దగ్గరికి వెళ్లారు. మొబైల్ తీసుకున్న మ్యాథ్స్ లెక్చరర్ అందులో ఓ విద్యార్థిని ఫొటోను ఆకాశ్ డీపీగా పెట్టుకోవడంతో మందలించారు. ఒకవేళ ఆ డీపీ తీయకపోతే ఇంట్లోవాళ్లకి, పోలీసులకు చెప్తానంటూ హెచ్చరించారు.

అయితే, క్లాస్ రూమ్‌లో అందరి ముందు లెక్చరర్ ఆ విషయాన్ని ప్రస్తావించడంతో పాటు పోలీసులకు కూడా చెప్తాననడంతో ఆకాశ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన ఆత్మహత్యకు మ్యాథ్స్ లెక్చరరే కారణమంటూ లెటర్ రాసి.. బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అగ్నిమాకప సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు మ్యాథ్స్ లెక్చరర్‌ని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రచయిత గురించి
రావు
గోనె.మహేష్ సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెబ్‌స్టోరీ విభాగానికి సంబంధించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.