తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా సీఎం కేసీఆర్ సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరిసింహస్వామి దేవస్థానంలో కేసీఆర్ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కేసీఆర్ కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ రోజు శ్రీ నృసింహ సుదర్శన హోమం నిర్వహించారు. ఈ యాదాద్రి ఆలయ అధికారులు, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతి తక్కువ మంది సమక్షంలో ఈ హోమాన్ని దేవస్థానం అధికారులు, అర్చకులు నిర్వహించారు. నిన్న సీఎం కేసీఆర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనకు ఫాంహౌస్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డ్ అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,926 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. తాజాగా మహమ్మారి బారినపడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,209 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
సీఎం కేసీఆర్ కోసం యాదాద్రిలో ప్రత్యేక హోమం
సీఎం కేసీఆర్కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని యాదాద్రి దేవస్థానంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదదపండితులు సుదర్శన యాగం చేశారు.
Samayam Telugu 20 Apr 2021, 12:30 pm
ప్రధానాంశాలు:
- సీఎం కేసీఆర్కు కరోనా పాజిటివ్
- యాదాద్రి ఆలయంలో సుదర్శన యాగం
- సీఎం ఆరోగ్యం మెరుగు పడాలంటూ పూజలు