యాప్నగరం

అత్తతో గొడవ పడ్డ కోడలు.. కాసేపటికి నిద్ర లేచి చూస్తే షాక్!

Suryapet: సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం కోమటికుంటలో ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోగుల రాజు, శ్రీలత (27) భార్యభర్తలు.

Samayam Telugu 22 Jan 2021, 10:58 pm
అత్తతో గొడవపడ్డ కోడలు విపరీతమైన నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అంతేకాక, ఆమె తన కన్న బిడ్డలను కూడా తీసుకొని అదృశ్యమయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. అయితే, భర్త ఉపాధి కోసం ఇంట్లో ఉండకపోవడంతో అత్తా కోడళ్ల మధ్య వైరం బాగా పెరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలివీ..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
woman missing in suryapet


సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం కోమటికుంటలో ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోగుల రాజు, శ్రీలత (27) భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు శ్రావ్య (10), రిషికేశ్ (7) ఉన్నారు. భర్త రాజు ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య శ్రీలత ఇంటి వద్ద అత్తతోనే ఉంటోంది. ఈ నెల 21న శ్రీలత తన భర్త వద్దకు వెళ్తానని అనడంతో అత్త వద్దని వారించింది. దీంతో అది గొడవకు దారి తీసింది.

అత్త నిద్ర పోయాక.. ఆమె పిల్లలను కూడా తనతో పాటు తీసుకొని ఇంటి నుంచి బయటికెళ్లింది. అయితే చివరికి భర్త వద్దకు శ్రీలత, పిల్లలు వెళ్లలేదు. ఈ విషయం బంధువులకు తెలియడంతో వారు ఎన్ని చోట్ల వెతికినా ఆమె జాడ తెలియలేదు. భర్త రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.