యాప్నగరం

నల్గొండ రోడ్డుప్రమాద బాధితులకు సర్కారు పరిహారం.. నగదుతోపాటు పిల్లల చదువు కోసం..

దేవరకొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది చనిపోగా మరో 10 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది.

Samayam Telugu 23 Jan 2021, 7:01 am
నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ సర్కారు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దేవరకొండ గవర్నమెంట్ హాస్పిటల్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం, డబుల్ బెడ్రూం ఇళ్లను అందజేస్తామన్నారు. వారి పిల్లలకు మెరుగైన విద్య అందించడం కోసం గురుకులాల్లో చదవిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
Samayam Telugu naglonda accident


ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు దేవకొండ హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టడం.. దీనికి మద్దతుగా బీజేపీ శ్రేణులు డెడ్ బాడీలను తరలించే వాహనాలను అడ్డుకున్నాయి. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. వెంటనే అక్కడికి చేరుకున్న మంత్రి బాధిత కుటుంబాలతో మాట్లాడటంతో వారు శాంతించారు.

పెద్ద అడిశర్లపల్లి సమీపంలోని అంగడిపేట వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో, లారీ డీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా దేవరకొండ మండలం చింతబావికి చెందిన వ్యవసాయ కూలీలు. పీఏపల్లి మండలం రంగారెడ్డి గూడెంలో వరి నాట్లు వేయడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.