యాప్నగరం

అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి.. కోదాడ వాసిగా గుర్తింపు

Telangana News: రవి కుమార్ స్నేహితులతో కలిసి బోటింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు అక్కడి ఓ సరస్సు వద్ద మృతి చెందాడు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు.

Samayam Telugu 19 Jun 2021, 3:20 pm
తెలంగాణకు చెందిన మరో యువకుడు అమెరికాలో ప్రాణాలు కోల్పోయాడు. పైచదువులు, ఉన్నత ఉద్యోగం కోసం అక్కడికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు చనిపోయాడు. కోదాడకు చెందిన సిరిపురపు రవికుమార్‌ (26) అనే యువకుడు యూఎస్‌లో సిగ్నా ఇన్సూరెన్స్‌లో మూడేళ్లుగా పని చేస్తున్నాడు. కాగా.. తాజాగా రవి కుమార్ స్నేహితులతో కలిసి బోటింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు అక్కడి ఓ సరస్సు వద్ద మృతి చెందాడు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు. తమ తనయుడి మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు సాయం చేయాలని యువకుడి తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.