యాదాద్రి జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్పై బదిలీ వేటుపడింది. పల్లె, పట్టణప్రగతి కార్యక్రమ నిర్వహణలో అలసత్వం చేసినందుకు బదిలీ జరిగినట్లు తెలిసింది. కాగా అనిత రామచంద్రన్ స్థానంలో యాదాద్రి కొత్త కలెక్టర్గా పమేలా శత్పథి నియామకం అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకముందు పల్లె, పట్టణప్రగతి పురోగతిపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరం అని ఆయన పేర్కొన్నారు.
యాదాద్రి జిల్లా కలెక్టర్పై సడెన్గా బదిలీ వేటు.. ఎందుకంటే..
Yadadri: అనిత రామచంద్రన్ స్థానంలో యాదాద్రి కొత్త కలెక్టర్గా పమేలా శత్పథి నియామకం అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్లె, పట్టణప్రగతి పురోగతిపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Samayam Telugu 13 Jun 2021, 9:35 pm
ప్రధానాంశాలు:
- యాదాద్రి కలెక్టర్పై బదిలీ వేటు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- పల్లె, పట్టణ ప్రగతిలో ఆలసత్వమే కారణం!