యాప్నగరం

సూర్యాపేట: కల్నల్ సంతోష్‌బాబుకి అరుదైన గౌరవం.. ఆయన పుట్టిన గడ్డపై..

గాల్వన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబుకి ఆయన పుట్టిన గడ్డపై అరుదైన గౌరవం లభించింది. ఆయనను స్థానికులు స్మరించుకుంటూ నివాళులర్పించారు.

Samayam Telugu 16 Jan 2021, 12:17 pm
చైనా సైనికులతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబుకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన సేవలను స్మరించుకుంటూ అక్షరాలతో ఆయనకు సెల్యూట్ చేశారు స్థానికులు. స్థానిక వార్తా సంస్థ సంతోష్‌బాబు స్మారకంగా ప్రత్యేక సంచిక(స్పెషల్ ఎడిషన్)ను రూపొందించింది. ఆ సంచికను రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చేతలుమీదుగా ఆవిష్కరించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష్‌బాబు సేవలను కొనియాడారు. అలాగే యానాల వైవై రెడ్డి రచించిన పాలకంకుల పరిగ సంకలనాన్ని మంత్రి ఆవిష్కరించారు. మంత్రితో పాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, సూర్యాపేట టైమ్స్ ఎడిటర్ డేగల జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
santosh babu


గత జూన్‌లో ఇండియా చైనా నియంత్రణ రేఖ వద్ద గాల్వన్ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకి చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. గాల్వన్ నది ఒడ్డున, కొండల్లో నక్కి ఉన్న చైనీస్ సైనికులు మేకులున్న ఇనుప రాడ్లు, ఇతర ఆయుధాలతో దాడి చేశారు. ఆ దాడిలో సంతోష్‌బాబు గాల్వన్ నదిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ సంఘటన సంచలనంగా మారింది. దేశం యావత్తూ కల్నల్ సంతోష్‌బాబు మరణంతో చలించిపోయింది. ఆయన సేవలను స్మరించుకుంటూ స్థానికులు అక్షర నివాళి అర్పించడం విశేషం.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.