యాప్నగరం

సూర్యాపేట జిల్లాలో లారీ బీభత్సం.. బైకులపైకి దూసుకెళ్లి.. ఘోరం

జాన్‌పాడు దర్గా సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. దర్గాలో మొక్కులు చెల్లించుకుని తిరిగి బయలుదేరిన భక్తులపైకి లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.

Samayam Telugu 10 Sep 2021, 7:11 pm
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. బైకులను ఢీకొడుతూ రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పాలకవీడు మండలం జాన్‌పాడు దర్గాకి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. శుక్రవారం కావడంతో జాన్‌పాడు సైదులు దర్గాకి వెళ్లిన భక్తులు మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. దామరచర్ల వైపు వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ అదుపుతప్పి బైకులపై దూసుకొచ్చింది. అమాంతం రెండు బైకులను ఢీకొడుతూ పొలాల్లోకి దూసుకుపోయింది. దీంతో రెండు బైకులపై ప్రయాణిస్తున్న మహిళ సహా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మిర్యాలగూడ మండలం జంకు తండాకు చెందిన ధరావత్ పుణ్య, ఆయన భార్య మగ్తిగా గుర్తించారు. మరో మృత్యుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
accident


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.