యాప్నగరం

రామాలయంలో రథం తరలిస్తుండగా.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి.. కేతేపల్లిలో విషాదం

నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రాములోరి రథాన్ని తరలిస్తుండగా.. దానికి విద్యుత్ తీగలు తగలడంతో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 28 May 2022, 4:38 pm
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రామాయం నుంచి రథం తరలిస్తుండగా.. 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో.. ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. విద్యుత్ తీగలకు రథం తగిలిన విషయాన్ని గమనించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. మృతులను యాదయ్య, మోహనయ్య, దాసరి ఆంజనేయులుగా గుర్తించారు.
Samayam Telugu kethepally Ratham
kethepally Ratham


కరెంట్ షాక్ తగలగానే కిందపడిపోయిన వారిని గ్రామస్థులు హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. కానీ వారు అప్పటికే చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అనూహ్యంగా ముగ్గురు చనిపోవడంతో కేతేపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అసలేం జరిగిందంటే..?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కేతపల్లి గ్రామ శివారులో ఉన్న రామాలయంలో ఉత్సవాల సందర్భంగా ఇటీవల రథోత్సవం నిర్వహించారు. ఇనుప రథం కావడంతో వర్షానికి తుప్పు పడుతుందనే ఉద్దేశంతో శనివారం దాన్ని రథశాలకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న 11 కేవీ విద్యుత్తు తీగలకు రథం తాకింది. దీంతో కరెంట్ షాక్‌కు గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు... రాజబోయిన యాదయ్య(45), పొగాకు మోహన్(36) కేతేపల్లి గ్రామానికి చెందిన వారు కాగా.. దాసరి ఆంజనేయులు (26)ది గుర్రంపూడ్‌ మండలం మక్కపల్లి గ్రామం.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.