యాప్నగరం

భూమి చదును చేస్తుండగా దొరికిన లంకె బిందె.. నిండా బంగారం

ట్రాక్టర్‌తో భూమిని చదును చేస్తున్నాడు. దీంతో అతడికి లంకె బిందెె లభ్యం అయ్యింది. బిందె నిండా బంగారం లభ్యం కావడంతో పంపకాల్లో వివాదం తలెత్తింది. దీంతో ఓ హొంగార్డు ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు.

Samayam Telugu 12 Jul 2021, 8:56 am
సూర్యాపేట జిల్లాలో లంకె బిందె లభ్యం అయ్యింది. చివ్వెంల మండలం తుల్జారావుపేట గ్రామంలో లంకెబిందె దొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాక్టర్ తో భూమి చదునుచేస్తుండగా లంకె బిందె లభ్యం అయ్యింది. అయితే దొరికొని లంకె బిందెలోని బంగారం పంపకాల్లో ముగ్గురు వ్యక్తుల మధ్య వివాదం తలెత్తింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


దీంతో ఈ వివాదాన్ని ఓ హోంగార్డ్ సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. బందెలోని బంగారాన్ని ఒకరికి 14 లక్షలు, మరొకరికి 10 లక్షల చొప్పున పంపిణీ చేశారు. బంగారాన్ని అమ్మి తనతో పాటు మరో వ్యక్తి పంచుకునేలా ఒప్పందం చేసుకున్నాడు హోంగార్డ్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇప్పుడు గ్రామంలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.