యాప్నగరం

పంచాయతీ కార్యదర్శిపై టీఆర్ఎస్ నేతల దాడి.. ఉద్యోగుల ఆందోళన

పంచాయతీ కార్యదర్శిపై అధికార పార్టీ నేతల దాడి ఘటన నల్గొండ జిల్లాలో కలకలం రేపింది. ఉద్యోగి తల పగలగొట్టడంపై ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Samayam Telugu 26 Apr 2022, 5:51 pm
అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు రెచ్చిపోయారు. పార్టీ జెండా దిమ్మె నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదంటూ పంచాయతీ కార్యదర్శిపై దాడికి తెగబడ్డారు. సాక్షాత్తూ గ్రామ సర్పంచ్, మరో ఎంపీటీసీ సభ్యురాలి భర్త పంచాయతీ కార్యదర్శిని కర్రలతో కొట్టి గాయపరచడం నల్గొండ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. చుండూరు మండలం చామనపల్లి గ్రామంలో టీఆర్ఎస్ జెండా దిమ్మె నిర్మించేందుకు కార్యదర్శి లక్ష్మారెడ్డిని అనుమతులు కోరారు.
Samayam Telugu lynching


పాలకవర్గం అనుమతి లేకుండా ఏకపక్షంగా అనుమతులు ఇవ్వలేమని.. పాలకవర్గం సమావేశంలో తీర్మానం చేసిన తర్వాత అనుమతి ఇస్తామని చెప్పడంతో సర్పంచ్ ఎర్రయ్య. ఎంపీటీసీ సభ్యురాలి భర్త వెంకటయ్య ఆగ్రహం చెందారు. అనుమతి ఇవ్వలేదంటూ విచక్షణ కోల్పోయి పంచాయతీ కార్యదర్శి లక్ష్మారెడ్డిపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. తల పగిలి రక్తస్రావమైంది. ఉద్యోగిపై దాడి చేశారని తెలియడంతో సహోద్యోగులు, ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. సర్పంచ్‌ని పదవి నుంచి తొలగించాలని.. నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం అలజడి రేపింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.