యాప్నగరం

బికారి రాష్ట్రాలను ఆదుకుంటోంది మనమే.. కేసీఆర్ సన్నిహితుడి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ అప్పులు చేయడం మినహా చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కేసీఆర్ అప్పుల కంటే ఇంకో 26 రాష్ట్రాలు ఎక్కువే చేశాయని చెప్పుకొచ్చారు.

Samayam Telugu 12 Feb 2021, 6:08 pm
నాగార్జున సాగర్ బైపోల్, ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతలు నోటికి పనిచెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని.. కేసీఆర్ చేసిందేమీ లేదని ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. కేసీఆర్ అప్పులు చేయడం మినహా చేసిందేమీ లేదని చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kcr


తెలంగాణ దేశాన్ని ఆదుకుంటోందని.. వంద రూపాయలు పన్ను కడితే కేవలం 40 రూపాయలు మాత్రమే వెనక్కి తీసుకుంటున్నామని పల్లా వ్యాఖ్యానించారు. మన దేశంలోని బికారి రాష్ట్రాలను, దేశాన్నీ ఆదుకుంటున్నామంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ అప్పులు చేస్తున్నారనడం కూడా తప్పేనని.. మనకంటే 26 రాష్ట్రాలు ఎక్కువే అప్పులు చేశాయంటూ ఆయన ప్రతిపక్షాల విమర్శలకు ఘాటు రిప్లై ఇచ్చారు. దేశంలోని పేద రాష్ట్రాలకు, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం పన్నుల రూపంలో పెద్దఎత్తున ఆదాయం సమకూర్చి ఆదుకుంటోందంటూ చెప్పుకొచ్చారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.