యాప్నగరం

Munugode Bypoll: మునుగోడులో స్పీడ్ పెంచిన టీఆర్ఎస్.. బీజేపీ కంటే ఒక్కరోజు ముందే సభ

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ దూకుడు పెంచింది. బీజేపీ 21వ తేదీన సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుండగా.. అంతకంటే ఒకరోజు ముందే సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 12 Aug 2022, 10:59 am

ప్రధానాంశాలు:

  • మునుగోడులో ఊపందుకున్న రాజకీయం
  • ఉపఎన్నికలో గెలుపు కోసం రాజకీయ పార్టీల ఎత్తులు
  • 20న మునుగోడులో సభ నిర్వహించనున్న టీఆర్ఎస్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu TRS
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Raj Gopal Reddy) రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు(Munugode)లో ఉపఎన్నికను టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రజల మూడ్‌ను ప్రతిబింబించేదిగా భావిస్తున్న ఈ ఉపఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని కంకణం కట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 21న బీజేపీ మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) సహా పలువురు బీజేపీ ప్రముఖులు ఈ సభకు హాజరుకానున్నారు. అయితే టీఆర్ఎస్(TRS) అంతకంటే ముందే సభను నిర్వహించి బీజేపీకి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమంది. ఈ నెల 20న భారీ బహిరంగ సభను నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.
గురువారం జరిగిన మంత్రివర్గ భేటీలో మునుగోడు ఉప ఎన్నికపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మంత్రివర్గ సహచరుల వద్ద ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. మునుగోడులో తాజాగా చేయించిన సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. మునుగోడులో ఉన్న ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నేతలంతా కలిసి శ్రమిస్తేనే విజయం వరిస్తుందని సూచించారు.

మంత్రివర్గం సమావేశం తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో మునుగోడు ఉప ఎన్నికపై చర్చించారు. అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఎలాంటి విభేదాలు, వివాదాల జోలికిపోవద్దని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.