యాప్నగరం

విజయవాడ జాతీయ రహదారిపై రాజధాని బస్సులో మంటలు.. క్షణాల్లో కాలి బూడిద

Bus Fire Accident: నిన్న సూర్యాపేట సమీపంలో మంటలు చెలరేగి ఏసీ బస్సు దగ్ధమైన ఘటన మరువకముందే మరో రాజధాని బస్సు మంటల్లో చిక్కుకుంది. హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై సూర్యాపేట జిల్లా మెుద్దుల చెరువు వద్ద మియాపూర్ డిపోకు చెందిన బస్సు మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు అప్పటికే కిందకు దిగటంతో పెను ప్రమాదం తప్పింది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 30 Mar 2023, 12:01 pm

ప్రధానాంశాలు:

  • రాజధాని బస్సులో చేలరేగిన మంటలు
  • ప్రయాణికులకు కిందకు దిగటంతో తప్పిన ముప్పు
  • సూర్యాపేట జిల్లా మెుద్దుల చెరువు వద్ద ఘటన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rajadani Bus Fire
రాజధాని బస్సులో మంటలు
Rajadani Bus Fire: హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణ ఆర్టీసీకి చెందిన మరో రాజధాని బస్సు దగ్ధమైంది. మియాపూర్‌ డిపోకు చెందిన రాజధాని బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద స్కూటీని ఢీకొట్టింది. దీంతో బస్సులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే ప్రయాణీకులను అప్రమత్తం చేయడంతో అందరూ బస్సు దిగి పరుగులు తీశారు. స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ ప్రాంతంలో సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన ద్విచక్ర వాహనదారుడిని సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి‌ మునగాల మండలం ఇందిరానగర్ కు చెందిన రాజుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే సురక్షిత ప్రయాణానికి మారుపేరైన తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సులు వరుసగా మంటల్లో చిక్కుకోవడంపై ప్రయాణీకులు హడలిపోతున్నారు. నిన్న (మార్చి 29న) ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున ఏ ఏసీ బస్సు ఖమ్మం నుండి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. చివ్వెం వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. బస్సును రిపేర్ కోసం సూర్యాపేట డిపోకు తరలిస్తుండగా.. సూర్యాపేట-ఖమ్మం రహదారిపైబస్సులో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది.. సంఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో పూర్తిగా కాలిపోయింది. షాట్ సర్కుట్ కారణంగానే బస్సులో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు.

గత నెల (ఫిబ్రవరి 26న) కూడా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై రెండు బస్సులు మంటల్లో చిక్కుకున్నాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరింది. ఈ క్రమంలో దురాజ్‌పల్లి వద్ద బస్సులో సాంకేతిక లోపం తలెత్తి ఆగిపోగా.. అందులోని ప్రయాణికుల్ని మరో బస్సులో తరలించారు. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు విజయవాడ నుంచి మరో బస్సును రప్పించారు. నిలిచిపోయిన బస్సుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో ఓ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే రెండు బస్సులకు మంటలు అంటుకొని అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ సమయంలో బస్సుల్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో షార్ట్ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. ఇలా ఆకస్మాత్తుగా బస్సుల్లో మంటలు చెలరేగటం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.


  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.