యాప్నగరం

ఉదయం తేలిన యువకుడు.. మధ్యాహ్నం మహిళ, సూర్యాపేటలో షాకింగ్ ఘటన

చెరువులో ఇద్దరు విగతజీవులుగా పైకి తేలడం సూర్యాపేటలో కలకలం రేపింది. యువకుడు, మహిళ మృతదేహాలు బయటపడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Samayam Telugu 31 Oct 2021, 6:57 pm
చెరువులో యువకుడి మృతదేహం తేలింది. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా మరో శవం బయటికొచ్చింది. మధ్యాహ్నం మహిళ మృతదేహం తేలడం కలకలం రేపింది. ఒకే రోజు చెరువులో రెండు మృతదేహాలు బయటపడడం అనుమానాలకు తావిస్తోంది. ఈ షాకింగ్ ఘటన సూర్యాపేట పట్టణంలో జరిగిం.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


పట్టణంలోని చౌదరి చెరువులో ఈ రోజు ఉదయం గుర్తు తెలియని యువకుడి మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని యువకుడి వివరాలు ఆరా తీస్తున్నారు. ఇంతలోనే అనూహ్యంగా మరో మృతదేహం పైకి తేలింది. మధ్యాహ్నం సమయంలో మహిళ శవం చెరువులో బయటపడింది. ఒకేరోజు యువకుడు, మహిళ మృతదేహాలు బయటపడడం సందేహాలను లేవనెత్తుతోంది. పోలీసులు ఇద్దరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతదేహాలు ఎవరివి? ఎందుకు చనిపోయారనే ప్రశ్నలకు స్పష్టత రావాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.