యాప్నగరం

నల్గొండలో జంట హత్యలు.. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు

మృతి చెందిన ఇద్దరు కూడా వేరే రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

Samayam Telugu 25 Jan 2021, 9:37 am
నల్గొండలో జంట హత్యలు కలకలం రేపాయి. పట్టణంలోని రాంనగర్ లో డబుల్ మర్డర్ సంచలనం సృష్టించాయి. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. వారిని బండరాళ్లతో కొట్టి చంపారు దుండగులు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు టూ టౌన్ పోలీసులు. పోలీసులు ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు మద్యం మత్తులో ఏమైాన గొడవ తలెత్తిందా అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
nalgonda double murder


Read More: రూ. 20 వాటర్ బాటిల్‌కు రూ.25వేలు.. రెస్టారెంట్ తిక్క కుదిర్చిన కస్టమర్

మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా ఇతర రాష్ట్రానికి చెందినవారిగా పోలీసుల అనుమానిస్తున్నారు.అయితే మృతులు రు ఏ రాష్ట్రం వారు అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటన పట్టణంలో స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.