హైదరాబాద్ టూ శ్రీకాకుళం... చెల్లి పెళ్లికి బైక్పై వెళ్తూ ఇద్దరి మృతి
సూర్యాపేట జిల్లా మునగాల మండలం కేంద్రం వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకుడు ప్రాణాలు కోల్పోయారు. వీరు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం బైక్పై వెళ్తున్నారు.
Samayam Telugu 27 Apr 2021, 8:44 am
ప్రధానాంశాలు:
- సూర్యాపేట జిల్లాలో రోడ్డుప్రమాదం
- బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకుడ దుర్మరణం
- హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా ఘటన
చెల్లి పెళ్లి కోసం ఉత్సాహంగా షాపింగ్ చేశాడు. స్వగ్రామానికి బస్సులో వెళ్లాలని అన్న చెప్పినా వినకుండా బావమరిదితో కలిసి బైక్పై బయలుదేరాడు. అంతలోనే వారిని మృతువు కబళించింది. రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ హృదయవిదారక సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రం శివారులోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం చంద్రయ్యపేట గ్రామానికి చెందిన నడిపింటి రాము (27), తెంబూరు గ్రామానికి చెందిన సరియపల్లి నగేశ్ (25)లు వరుసకు బావబావమరుదులు. వీరిద్దరు ఏడేళ్లుగా హైదరాబాద్లో సుతారీ మేస్త్రీలుగా పనిచేస్తున్నారు. వరుసకు చెల్లి అయ్యే యువతికి కొద్దిరోజుల్లోనే పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పెళ్లికి అవసరమైన చీరలు, కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను రాము, నగేష్ హైదరాబాద్లో కొనుగోలు చేశారు. తాము బైక్పై సొంతూరుకు వస్తున్నామని రాము తన అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పగా అతడు వద్దని వారించాడు. అయినా వినిపించుకోకుండా రాము, నగేష్ కలిసి హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని సొంతూరుకు బయలుదేరాలు.
చీరల మూటను బైక్ పెట్రోల్ ట్యాంక్పై పెట్టుకుని హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వెళుతుండగా సూర్యాపేట మునగాల మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్ బంక్ సమీపంలోని మలుపు వద్ద బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న బండరాయిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు చేరవేశారు.
చీరల మూటను బైక్ పెట్రోల్ ట్యాంక్పై పెట్టుకుని హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వెళుతుండగా సూర్యాపేట మునగాల మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్ బంక్ సమీపంలోని మలుపు వద్ద బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న బండరాయిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు చేరవేశారు.