యాప్నగరం

ఇది కేసీఆర్ కలల ప్రాజెక్టు.. యాదాద్రి అద్భుత వీడియో విడుదల చేసిన కేటీఆర్

Yadadri: యాదాద్రిలో ఫిబ్రవరి 18 నుంచి 21వ తేదీ మధ్య అధ్యయనోత్సవాలు, 22 నుంచి 28 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ క్రమంలో అంతకంటే ముందే భక్తుల దర్శనానికి అనుమతించే యోచనలో ఉన్నారు.

Samayam Telugu 24 Jan 2021, 11:20 pm
యాదాద్రి ఆలయం సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అని.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ప్రపంచస్థాయిలో పునరుద్ధరించారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆలయానికి సంబంధించిన వీడియోను ఆదివారం కేటీఆర్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను చేపట్టిన కేసీఆర్.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఎంతో పట్టుదలతో పూర్తి చేశారని అన్నారు. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నట్లు కేటీఆర్‌ చెప్పారు.
Samayam Telugu యాదాద్రి వీడియోలోని చిత్రం
Yadadri



యాద్రాద్రి నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. భవిష్యత్తు తరాల వారికి గొప్పగా కనిపించేలా యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దారు. మొత్తానికి యాదాద్రి రూపురేఖలే మారిపోయాయి. ఆలయ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. అద్భుత శిల్పకళతో యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సుందరంగా రూపుదిద్దుకుంది.

యాదాద్రిలో ఫిబ్రవరి 18 నుంచి 21వ తేదీ మధ్య అధ్యయనోత్సవాలు, 22 నుంచి 28 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ క్రమంలో అంతకంటే ముందే భక్తుల దర్శనానికి అనుమతించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం బాలాలయంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. గర్భగుడిలో మాత్రం స్వామివారికి నిరంతరం పూజాకైంకర్యాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 16, 18న రథ సప్తమి పర్వదినాలు ఉండడంతో ఆ ముహూర్తాల్లోనే యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆలయాన్ని ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై సీఎం కేసీఆర్.. చిన్నజీయర్ స్వామి సలహాను తీసుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.