యాప్నగరం

షాకింగ్! రాజ్‌భవన్‌కూ పాకిన కరోనా.. 10 మంది సిబ్బందికి పాజిటివ్

Telangana Raj Bhavan: రాజ్ భవన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు మొత్తం 398 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 28 మంది పోలీసు సిబ్బందికి, 10 మంది రాజ్‌భవన్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Samayam Telugu 12 Jul 2020, 11:04 pm
తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి రాజ్‌భవన్‌కు సైతం చేరింది. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న 10 మంది భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కరోనా పరీక్షల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరాజన్‌, ఇతర సీనియర్‌ అధికారులకు నెగిటివ్‌ అని తేలింది. రెడ్‌జోన్లలో కాంటాక్ట్ హిస్టరీ ఉన్నవాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. ఈ మేరకు తెలంగాణ రాజ్‌భవన్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
Samayam Telugu తమిళిసై
Thamilisai


రాజ్ భవన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు మొత్తం 398 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 28 మంది పోలీసు సిబ్బందికి, 10 మంది రాజ్‌భవన్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 347 మంది సిబ్బందికి కరోనా నెగిటివ్ అని తేలింది.

Must Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.