యాప్నగరం

తెలంగాణలో ఒక్కరోజే 1000 దాటిన కేసులు.. మొత్తం మృతులు 267

Coronavirus Cases in Hyderabad: వరంగల్ రూరల్ జిల్లా, మంచిర్యాల జిల్లాల్లో 9 కేసులు గుర్తించారు. ఖమ్మంలో 7, నల్గొండ, జగిత్యాల జిల్లాల్లో 4 కేసులు, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో 3 కేసులు నమోదయ్యాయి.

Samayam Telugu 1 Jul 2020, 9:32 pm
తెలంగాణలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం ఒక్కరోజులోనే పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,018 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,357కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 9,008గా ఉన్నాయి. గత 24 గంటల్లో 788 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 8,082కు చేరింది. ఇక బుధవారం మరో ఏడుగురు వ్యక్తులు కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 267కి చేరింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం (Photo Credit: Pixabay)
Coronavirus in telangana


బుధవారం రోజు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే పెద్ద ఎత్తున 881 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో ఉంది. అక్కడ 36 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 33 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో మహబూబ్ నగర్ జిల్లా ఉంది. ఇక్కడ 10 కేసులు నమోదయ్యాయి.

ఇక వరంగల్ రూరల్ జిల్లా, మంచిర్యాల జిల్లాల్లో 9 కేసులు గుర్తించారు. ఖమ్మంలో 7, నల్గొండ, జగిత్యాల జిల్లాల్లో 4 కేసులు, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో 3 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట, కామారెడ్డి, ములుగు, ఆసిఫాబాద్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రిలో 2 కేసుల చొప్పున గుర్తించారు. గద్వాల జిల్లాలో ఒక కేసు నమోదైంది.

మరోవైపు, తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 4,234 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1,018 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 92,797కు చేరింది. బుధవారం 3,216 ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి.

Also Read: undefined

కరోనా టెస్టులు చేసే కేంద్రాలివీ..
గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్), హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్), ఆదిలాబాద్‌లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వివరించారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.