యాప్నగరం

తెలంగాణలో మళ్లీ పెరిగిన కేసులు.. ఇవాళ ఎన్నంటే

తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు రెండు లక్షల అరవైవేలు దాటాయి. ఇప్పటివరకు నిర్వహించిన టెస్టుల సంఖ్య కూడా 50 లక్షల మార్క్ దాటింది.

Samayam Telugu 19 Nov 2020, 9:22 am
తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. గతవారం కాస్త తగ్గిన కేసులు.. తాజాగా వెయ్యి దాటి నమోదవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 1058 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,60,834కి చేరింది. ఇందులో 2,46,733 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో 12,682 కేసులు ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా 4 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1419కి చేరింది.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in telangana


Read More: Konda Vishweshwar Reddy: పబ్లిక్‌తో పాటు కేసీఆర్,కేటీఆర్ కూడా ఆ టాయిలెట్స్ వాడుతున్నారు.. మరో సెటైర్

నిన్న ఒక్కరోజే తెలంగాణలో 1440 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం. మరోవైపు హోం ఐసొలేషన్‌లో 10,352 మంది చికిత్స పొందుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా 168 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. బుధవారం నాటి బులెటిన్‌తో పోల్చుకుంటే.. ఈ సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 38,757 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 50 లక్షల మార్క్‌కు చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.