యాప్నగరం

TS: పంజా విసురుతున్న కరోనా.. ఒక్కరోజే 1000 దాటిన కొత్త కేసులు

Coronavirus Hyderabad: జీహెచ్ఎంసీ పరిధిలోనే భారీగా రికార్డు స్థాయిలో 888 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది.

Samayam Telugu 27 Jun 2020, 10:30 pm
తెలంగాణలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. శనివారం ఒక్కరోజులోనే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 1087 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,436కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 8265గా ఉన్నాయి. గత 24 గంటల్లో 162 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,928కు చేరింది. ఇక శనివారం మరో ఆరుగురు వ్యక్తులు కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 243కి చేరింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
corona test


శనివారం రోజు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే భారీగా రికార్డు స్థాయిలో 888 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 74 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 37 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో నల్గొండ జిల్లా ఉంది. ఇక్కడ 35 కేసులు నమోదయ్యాయి.

ఇక సంగారెడ్డిలో 11 కేసులు గుర్తించారు. కామారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్‌లో 5, వరంగల్ అర్బన్‌లో 7, సిరిసిల్లలో 3, భద్రాద్రి, సిద్దిపేటలో 2, జనగామ, నాగర్‌కర్నూల్‌లో 4, ఆసిఫాబాద్, ఖమ్మం, వనపర్తి, మహబూబాబాద్, మంచిర్యాలలో ఒక్కోకేసు గుర్తించారు.

మరోవైపు, తెలంగాణలో శుక్రవారం 3923 కరోనా టెస్టులు చేశారు. వీటిలో నుంచే 1087 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ కరోనా టెస్టుల సంఖ్య 79231కు చేరింది. శనివారం 2836 ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి.

Also Read: undefined

కరోనా టెస్టులు చేసే కేంద్రాలివీ..
గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్), హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్), ఆదిలాబాద్‌లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వివరించారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.