యాప్నగరం

కరోనా నుంచి కోలుకున్న శిశువు.. రోజుల వయసులోనే పాజిటివ్

Gandhi Hospital: 20 రోజుల క్రితం కరోనా సోకిన తన బిడ్డతో ఎంతో ఆందోళనతో గాంధీ ఆస్పత్రిలో అడుగుపెట్టిన ఆ తల్లి బుధవారం సంతోషంతో ఇంటికి వెళ్లింది. కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకొన్న అతి పిన్న వయస్కుడిగా ఈ శిశువు గుర్తింపు పొందాడు.

Samayam Telugu 29 Apr 2020, 7:57 pm
తెలంగాణ ప్రభుత్వం కరోనాను తరిమికొట్టేందుకు నిరంతరం కృషి చేస్తోంది. రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో రోజుల వయసున్న చిన్నారి కూడా ఉన్న సంగతి తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శిశువుకు కరోనా పాజిటివ్ రావడంతో కొద్ది రోజుల క్రితం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఇప్పుడు ఆ శిశువుకు చికిత్స పూర్తై డిశ్చార్జి అయ్యాడు. బుధవారమే చిన్నారి తల్లి ఒడికి చేరి ఇంటికి వెళ్లాడు. దీంతో ఆ తల్లి ఆనందంలో మునిగిపోయింది.
Samayam Telugu gandi


20 రోజుల క్రితం కరోనా సోకిన తన బిడ్డతో ఎంతో ఆందోళనతో గాంధీ ఆస్పత్రిలో అడుగుపెట్టిన ఆ తల్లి బుధవారం సంతోషంతో ఇంటికి వెళ్లింది. కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకొన్న అతి పిన్న వయస్కుడిగా ఈ శిశువు గుర్తింపు పొందాడు. ఈ నెల 10న మహబూబ్ నగర్ జిల్లా ఓ గ్రామానికి చెందిన రోజుల చిన్నారికి విరేచనాలు అవడంతో ఆస్పత్రికి తరలించారు. కరోనా పాజిటివ్ రావడంతో గాంధీకి తరలించి వైద్య చికిత్సలు అందజేశారు.

ఆ చిన్నారితోపాటు మరో 13 మంది పిల్లలు కరోనాను జయించి సంతోషంగా ఇంటికి వెళ్ళారు. వీరితోపాటు తల్లిదండ్రులు సంతోషంతో గాంధీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, డాక్టర్లను ఎంతగానో అభినందించారు. ఇప్పటివరకు 25 మందిని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. తెలంగాణలో బుధవారం మరో 7 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది. బుధవారం మొత్తం 35 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 409కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 578 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.